షిరిడీ సాయిబాబా హిందువే

2009 June 25
Tags:
Posted by అభిషేక్ చౌదరి
కొన్నాళ్ళ క్రితం తాడేపల్లిగారు తన బ్లాగులో “నిజమైన గురువు” అనే పేరుతో రెండు పోష్టులు రాసారు. వాట్లలో షిరిడీ సాయిబాబాగారిని డైరెక్టుగా కాకున్నా ఇన్ డైరెక్టుగా ముస్లిమేమో అని తోపించేటట్టు రెండు కథలు రాసారు. ముక్యంగా ఆయన గురువుగారి పేరు రోషన్ షాహ్ అనడం వల్ల శిష్యుడైన సాయిబాబాగారు కూడా ముస్లిమేననే అభిప్రాయం ప్రజల్లో కలుగుద్ది. కానీ ఆయన గురువుగారికి వెంకూసా అనే హిందూపేరు కూడా ఉన్నట్లు ఆయన చరిత్రలు చెబతా ఉన్నాయి. పత్తి నారాయణరావుగారు తెలుగులో రాసిన సాయిసచ్చరిత్రలో “సున్తీ చేసుకోమని ఆయన భక్తులకి చెప్పేవారనీ, కానీ తన మటికి సున్తీ చేయించుకోలే”దనీ రాసారు. ఆ ముక్క భక్తులకెలా తెలిసిందంటే, ఆయన ఇంకో యేడాదికి సమాధి అవుతారనంగా విజయదశమి రోజున సడన్ గా కోపం దెచ్చుకుని బట్టలిప్పేసి నిలబడి “ఇప్పుడు చెప్పండ్రా నేను హిందువునో ముస్లిమునో !” అని అరిచారంట. మరి బాబా నిజంగా ముస్లిమైతే చిన్నప్పుడే సున్తీ చేయించుకునుండాలిగా !

ఓసారి ఓ భక్తురాలు “బాబాకి ఇంతివ్వాలి” అని ముందనుకుని తరవాత తక్కువిచ్చిందంట. ఆయనకి అందరి మనసులో మాటా తెల్సు కాబట్టి “ఈ పేద బ్రామ్మణ్ణి మోసం చెయ్యొద్దు” అని నవ్వారంట. బాబాగారు ఒరిజినల్ గా ముస్లిమే అయితే “ఈ పేద ఫకీరుని” అనకుండా “ఈ పేద బ్రామ్మణ్ణి” అని ఎందుకన్నారు ? అదొక్కసారే గాదు, ఇంకోసారెప్పుడో భక్తులతో సీరియస్ గా మాట్లాడతా “ఈ సద్ బ్రామ్మడు మిమ్మల్ని సరైన మార్గంలో తీసుకెల్తాడు” అని అదే మాట రిపీట్ చేసారు.

ఆ మద్దెని ఇంకో దత్తచరిత్ర పుస్తకం చదివా. అందులో షిరిడీ సాయిబాబా ఆంజనేయస్వామి అవతారమని రాసారు. తను బరద్వాజ గోత్రంలో పుట్టి మహారాష్ట్రలో ఫకీరు రూపంలో ప్రసిద్ధి పొందుతానని ఆంజనేయస్వామి అన్నారంట. మరి బరద్వాజ గోత్రం ముస్లిముల్లో ఉండే ఛాన్సు లేదే !

ఎట్ల చూసుకున్నా బాబా ముస్లిము కాదు, హిందువే ! శ్రీకృష్ణుడు గొల్లవాడిలా లీలలు చెయ్యలా ? అట్లాంటిదే బాబా ఫకీరు వేషం కూడా !
 

సంసారాల్ని నిలబెట్టే లైంగిక విద్యకైతే సై

2008 August 28
Posted by అభిషేక్ చౌదరి
Sex Education ని ధర్మబద్ధంగా నేర్పాలంటూ తాడేపల్లిగారు చేసిన పోష్టు

http://naasaahityam.blogspot.com/2008/08/blog-post_27.html

అదే సంగతి మరికొంచెం క్లియర్ గా చెప్తూ జగదీష్ గారు చేసిన పోష్టు

http://saradaa.blogspot.com/2008/08/blog-post_28.html

ఎప్పుడూ కన్యాశుల్కమేనా ?

2008 August 7
Posted by అభిషేక్ చౌదరి
ఇంగ్లీషులో మల్లే తెలుగులో కూడా వెబ్ జైనులు రావడం చానా బావుంది. ‘మావోళ్ళు’ కూడా కొన్ని రన్ చేస్తా ఉన్నారు. మావోళ్ళ సైట్లు కూడా ఫ్రీ అంటే మొదట్లో నాకు చానా ఆశ్చర్యమేసింది. విషయం అది గాదు. మొదట్లో నేనీ వెబ్ జైనులు చదవడం మొదులెట్టినప్పుడు కన్యాశుల్కం గురించి ఓ వ్యాసంలో చదివాను. మళ్ళా ఆర్నెల్లు పోయినాక ఇంకో వెబ్ జైనులో కన్యాశుల్కం గురించి ఇంకో వ్యాసం చదివాను. మళ్ళా రీసెంటుగా అదే కన్యాశుల్కం మీద ఇంకోటి ఇంకో చోట. వేరే టాపిక్కు లేనట్టు ఏందబ్బా ఇది ?

కన్యాశుల్కం నాకేం కొత్త గాదు. ఆ మాటకొస్తే ఎవురికీ కాదనుకుంటా.  సంఘసంస్కరణ అనంగానే ఇంకేం లేనట్టు అదే రాస్తారేంది ? అని. మన రాష్ట్రంలో నిజంగా సంఘసంస్కర్తంటే కందుకూరి వీరేశలింగం పంతులుగారు. ఆడోళ్ళ బతుకుల్ని బాగుచెయ్యడం కోసం నిజంగా ప్రాణాలకి తెగించినోడాయన. సర్వస్వం ధారపోసినవాడాయన. ఆయన కూడా ఆ టాపిక్కు మీద చానా రాశాడని గ్నాపకం. వాటికేం పబ్లిసిటీ లేదు. అసలు ఆయనొకడున్నాడని కూడా జెనం మర్చిపొయ్యే పరిస్తితొచ్చింది. ఇదిట్లా ఉంటే - సంఘసంస్కరణ కోసం తన జీవితంలో నిజంగా ఏమీ చెయ్యని గురజాడ - విజియనగరం రాజావారి ప్రాపకం సంపాదించి మూడ్ బాలేనప్పుడల్లా ఊటీకి పోయి షికార్లు కొట్టిన గురజాడ - వట్టి గాలి కబుర్లు చెప్పి బతికిన గురజాడని ఇలా ఆకాసానికెత్తడం చూస్తా ఉంటే నాకు ఏదో మూల బాదగా ఉంది.

దీన్లో ఇంకోటుంది. ఒకడి పేరు ఇట్లా పైకి రాకుండా జేసి, ఇంకొకడి పేరు మాత్రం అమాంతంగా ఆకాసానికెత్తెయ్యడానికి జెనమేం పిచ్చినాకొడుకులు కారు. దీనికి యెనకమాల ఏదో బలమైన కారణం తప్పకండా ఉండితీరుద్ది. అదేందా ? అని చానా రోజులమట్టీ నా బుర్ర బద్దలు కొట్టుకున్నాక నాకొకటనిపించింది. తప్పుగా అనుకోకండి. ఆ క్షణంలో నాకట్లా అనిపించిందంతే ! పైకనకండా ఉండలేకపోతున్నా. 

ఇది తెలవక చేస్తున్నది గాదు. చెయ్యాలని చేస్తున్నదే. గురజాడని పైకెత్తేవోళ్ళెవరికీ బేసికల్ గా బ్రామ్మలంటే పడదు. అసలు విషయం అది. సంఘసంస్కరణ పేరు జెప్పి బేపనోళ్ళని తిట్టడానికి కన్యాశుల్కం ఓ మంచి అవకాసం. ఆ అవకాసం ఇచ్చినోడు గురజాడ. ఎందుకంటే కన్యాశుల్కంలో ఆయన చిత్రించిన  బ్రామ్మిన్ పాత్రలన్నీ పచ్చి లోఫర్, కిలాడీ, రోగ్, రాస్కెల్ పాత్రలే. వాస్తవానికి పూర్తి విరుద్ధంగా, అట్లాంటి పాత్రల్ని ఎందుకు సృష్టించాడో ఆ మహానుబావుడు, నాకు తెలవదు. నాకు తెలిసి మంచీ, చెడూ అన్ని కులాల్లోను ఉన్నై. ఆ రోజుల్లో కన్యాశుల్కం ఆచారం చేసుకున్న బేపనోళ్ళని తల్చుకుంటే నా మటుకు నాకు చెడ్డ బాదేస్తది. వాళ్ళు చెడ్డోళ్ళు కారు. పేదోళ్ళు మాత్రమే. పిల్లల్ని అమ్ముకునేంత పేదరికంతో బాదపడ్డ కులాన్ని చూసి జాలిపడ్డం మానేసి వాళ్ళని విలన్లని చేసి చిత్రించడం అమానుషం. ఆ ఆచారమైతే పోయింది గానీ వాళ్ళల్లో ఎక్కువమంది ఇప్పటికీ పేదోళ్ళే. కేవలం కథ కోసం పాపులారిటీ కోసం, హాస్యం కోసం ఒక పేద కులాన్ని బదనామ్ చెయ్యడం మంచిది కాదు. నీ కులపోళ్ళంతా ఎదవన్నర ఎదవలైతే వాళ్లల్లో పుట్టినోడివి నువ్వు మాత్రం మంచోడివెట్లా అవుతావు ? నీకెందుకు మేం పీటేసి సన్మానం చెయ్యాల ? అని గురజాడని అడగాలనిపిస్తది. వీరేశలింగం ఎప్పుడూ ఆ అవకాశం ఇవ్వలా. ఆయన సంఘసంస్కరణ సబ్జెక్టుకే కట్టుబడ్డాడు. కులప్రసక్తి తేలా. అందుకని ఆయన రచనలు పనికిరావు. అందుకని వీరేశలింగానికి పబ్లిసిటీ లేదు.

బేసికల్లీ పాపం, గురజాడ కూడా బేపనోడే. బేపనోడు కాబట్టే తన కులం గురించి మొహమాటం లేకుండా నిజాయితీగా రాశాడు. వేరే కులపోళ్ళు తమ కులంలో లోటుపాట్ల గురించి ఎప్పుడైనా అట్లా పబ్లిక్ డిస్కషన్ చేశారా ? తమ మీద తాము జోకులేసుకునే మంచిమనసు వేరే కులపోళ్ళకి ఎక్కడుంది ? మా కులంలో కట్నాలూ వగైరా చండాలాలు చానా పెద్ద లెవిల్లో ఉన్నాయి. ఎవడ్రాస్తున్నాడు వాటి గురించి ? అది బ్రామ్మలకే చెల్లు. కన్యాశుల్కం ఆ కులం అంతర్గత గొడవ. తమ కులాన్ని ఎట్లా బాగుచేసుకోవాలో బేపనోళ్ళు తమలో తాము ఒకప్పుడు చేసుకున్న డిస్కషన్ అది. దాని గురించి మనం (నాన్-బ్రామ్మిన్సు) ఎందుకు డిస్కస్ చెయ్యాల్నో నాకు తెలవదు. ఇప్పుడు ఈ కాలంలో కన్యాశుల్కమూ లేదు, గాడిదగుడ్డూ లేదు. ఆ టాపిక్ కి ఇప్పుడు రిలవెన్సే లేదు. ఇప్పుడు మనముందు చానా టాపిక్కులున్నై. అవి ఎవడూ రాయడు. ఇంగ్లీడులో అదేదో Intellectual bankruptcy అంటారే - దాంటో పడి అఘోరిస్తన్నాం. మనకి వేరే ఐడియాల్లేవ్. అందుకే ఇంకా కన్యాశుల్కమే మనకి మాస్టర్ పీసై కూర్చుంది.

నిజమూ, నీతీ, నిజాయితీ లేని దిక్కుమాలిన కులపిచ్చి కన్యాశుల్క సమీక్షలతో మమ్మల్ని సావగొట్టకండి బాబూ ! గురజాడలాంటి అరకొర సంస్కర్తల్ని వదిలిపెట్టి వీరేశలింగంలాంటి నిజమైన సంస్కర్తలకి పబ్లిసిటీ ఇవ్వండి మహాప్రభో !   

శ్రీ గగన కుసుమోపాఖ్యానము

2008 February 20
Tags:
Posted by అభిషేక్ చౌదరి

ఎప్పటికప్పుడు “ఇదిగో తెలంగాణా, అదిగో తెలంగాణా” అని హడావిళ్ళు వినబడతా ఉన్నాయి. గడిచిన ఏడేళ్ళ బట్టీ ఇదే హోరు. ఇదే జోరు. నే బెజవాడెళ్ళినప్పుడల్లా మావాళ్ళూ అడుగుతా ఉంటారు. “ఏంది ? అక్కడ తెలంగాణా ఉజ్జెమం ఉరకలెత్తుతోందంటగా ? మేం పేపర్లలో చూస్తానే ఉన్నాం.” అని ! వాళ్ళు అలా అడుగుతుంటే నాకు నవ్వొచ్చేస్తది. తాటాకు సప్పుళ్ళకే బెదిరితే ఎట్లా ? అని ! అసలు ఇక్కడ తెలంగాణాలో ఉద్యమమా ? నా తలకాయా ? ఏమీ లేదు. ఎవడింట్లో వాడు కూర్చుని నోటికొచ్చిన స్టేట్‌మెంట్లు పడేస్తా ఉన్నాడు. అవేవో వేదవాక్కుల్లాగా పత్రికలవాళ్ళు రాసుకుని మన తలకాయలంత అక్షరాలతో మర్నాటి పొద్దున్నే మన మొగాన కొడతా ఉన్నారు. మనమేమో అవి చదువుకుని తొందరపడతా ఉన్నాం. రోజూ ఇదీ కత.

జై తెలంగాణా అనేవాళ్ళల్లో అందరికీ ఒకడంటే ఇంకొకడికి మంట. TRS కి కాంగ్రెస్ కీ పడదు. (లేదా కనీసం అట్ల పైకి కనిపిస్తా ఉన్నారు) కాంగ్రెస్ కీ BJP కి పడదు. BJP కీ మజ్లిస్‌కీ పడదు. మజ్లిస్‌కీ నరేంద్రకీ పడదు. వీళ్ళెవురికీ తెలుగుదేశమంటే పడదు. ఇంక వీళ్ళు ప్రత్యేక తెలంగాణా ఎట్ల సాదిస్తారు ?

ఈళ్ళు రోజూ పేలుస్తా ఉన్న జోకులకి నవ్వలేక పొట్ట చెక్కలై నవ్వడమే మానేసాం. “అసెంబ్లీలో తీర్మానమెందుకు ? ఎవరి అంగీకారాలూ మాకు అవసరం లేదు. మాకు పార్లమెంటుంది. అక్కడే తేల్చుకుంటాం.”అన్న TRS వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో ప్రత్యేక తెలంగాణా తీర్మానం చెయ్యాలని అరుస్తా రోజూ సస్పెండవుతున్నారు. ఎందుకో తెలవదు. బహుసా ఇదో రకం నాటకం. ఏదో ఒకటి చేసి రోజూ పేపర్లో రావాలి గదా ! అందరూ శత్రువులే. ఎవరి మద్దతూ ఎవరికీ అవసరం లేదు. కానీ అందరికీ తెలంగాణా కావాల. మరి తెలంగాణా వచ్చేదెట్లాగబ్బా ?

తెలుగోళ్ళ సమైక్యం హఠాత్తుగా బూతుమాటైపోయిన కరెంటు షాకులో బతుకుతున్నాం అందరం. ప్రాంతాలవారీగా తాతలనాడు చేసిన వాటాల పంపకాలతో సంతృప్తి చెందకుండా ఏకంగా ప్రత్యేక రాష్ట్రాలే అడిగేసేసేంత ధైర్యాన్ని బేషరతుగా appreciate చెయ్యకపోతే తన్నులు తినాల్సిన పరిస్థితిలో ఉన్నాం. మనమే పిచ్చోళ్ళమో అవతలోడే పిచ్చోడో సరింగా అర్థంకాని అయోమయంలో పడ్డాం.

ఓ రకంగా చూస్తే రెడ్డి చెప్పిందీ కరక్టే. దేశాల మధ్య గొడవలే చర్చల ద్వారా పరిష్కరించుకుంటా ఉంటే ప్రాంతాల మయాన గొడవలకి మాత్రం శాంతియుత పరిష్కారం  ఉండదా ? ఆంధ్రావాళ్ళకీ తెలంగాణా వాళ్ళకి మధ్య దారులేమీ మూసుకోపోలే. వాళ్ళిద్దరి మధ్యా అంత శత్రుత్వాలేమీ లేవు. బేసికల్‌గా వాళ్ళు ఒకరికొకరు పరాయోళ్ళు కారు. కాని ఇంకో డౌటు. తెలంగాణావాళ్ళు ఇంత గొడవ చేశారు కాబట్టి గాని లేకపోతే రెడ్డి గాని నాయుడు గాని తెలంగాణా సమస్యల్ని పట్టించుకుని ఉండేవాళ్ళా ? ఈ మాత్రం కేటాయింపులైనా చేసుండేవాళ్ళా ?

ఇప్పుడు ఏ.పి.ని అయిదు రాష్ట్రాలుగా విడగొట్టాలనే డిమాండ్లు వింటా ఉన్నాను. ఇవి రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో ఆయన అనుయాయిలు ఫ్యాబ్రికేట్ చేసినవి అని కొంతమంది అభిప్రాయం. తెలంగాణా ఉద్యమాన్ని ఆషామాషీ  చెయ్యడం కోసరం సృష్టించారంటున్నారు. తెలంగాణా కాక ఉత్తరాంధ్ర అంట. హైదరాబాదు-రంగారెడ్డి కేంద్రపాలిత ప్రాంతమంట. ప్రకాశం నెల్లూరూ కలుపుకుని గ్రేటర్ రాయలసీమంట. ఆ నాలుగు జిల్లాలతో షార్టర్ కోస్తా అంట. ఇంకా ఏందో వింటున్నాను. వై.ఎస్. ని అనడం వేస్టు. అసలు ఈ అసయ్యమైన గబ్బుకంతటికీ కారణం కేసీయారే. ప్రత్యేక తెలంగాణా వస్తే అది గాని TRS గాని కేసీయార్ చేతుల్లో ఏమీ ఉండవు. అందుకని అది రావడం కేసీయారుక్కూడా నిజంగా ఇష్టం లేదు. సమస్య ఇట్లా ఎటూ తెగకుండా నాన్తా ఉంటేనే ఆయనకి సేఫ్. తెలంగాణా రావడం పోవడం ఆయన చేతుల్లో లేదు. కనీసం రెండు మూడు పెద్ద పార్టీలు ఢిల్లీ స్థాయిలో ఏకమైతేనే తెలంగాణా వస్తది. కాబట్టి ఇందులో కేసీయార్ కి ఏమీ ప్రమేయం లేదు. ఇచ్చేవాళ్ళు తమ సంగతి తాము చూసుకుంటారు. అంతేగాని కేసీయార్ సంగతెందుకు చూస్తారు ? తెలంగాణా వస్తే TRS మెంబర్లంతా కాంగ్రెస్‌లోకో బీజేపీ లోకో దూకేస్తారు.

రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణా సీట్లు 119 మాత్రమే. ఆంధ్రాకి 175 ఉన్నాయి. ఆ కారణం చేత ప్రత్యేక తెలంగాణా తీర్మానాలు అసెంబ్లీలో నెగ్గే అవకాశం లేదు. పెట్టడం కూడా వేస్టే. ఆ సంగతి TRS వాళ్ళకి ముందే తెలుసు. అదీ గాక ఇందులో పార్టీ లాయల్టీలొకటి. పార్లమెంటులో కూడా జాతీయ పార్టీలు తెలంగాణా బిల్లుల్ని ఆమోదించే అవకాసాలు కనాకష్టం. అందుకు సిద్ధపడే ఏ పార్టీ అయినా ఆంధ్రావాళ్ళ ఆగ్రహాన్ని రుచిచూడాల్సి వస్తుంది. అధికారంలో లేనంతకాలం ప్రతివాడూ “జై తెలంగాణా” అనే అంటాడు. అప్పుడు అలా అరవడం సుళువు. అధికారంలోకొచ్చాక మాత్రం అంత సుళువు కాదు. వంద విషయాలు ఆలోచించాల్సి వస్తది. మన రాష్ట్ర BJP ఇప్పుడు జై తెలంగాణా అంటోంది. కాని వాళ్ళకి ఇక్కడ సీట్లూ వోట్లూ రెండూ రావు. నిజంగా వాళ్ళ NDA కూటమి అధికారంలోకొచ్చినా వాళ్ళు తెలంగాణా ఇవ్వరు-ఈ వంక చెప్పి ! “మేమూ జై తెలంగాణా అన్నమాట వాస్తవమే. కాని మాకు తెలంగాణాలో తగినన్ని సీట్లూ వోట్లూ రాలేదు కదా ! “అని తప్పించుకుంటారు. “ఓవరాల్ వోటింగ్ సరళి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమైక్యాన్నే కోరుకుంటున్నారనిపిస్తోంది”అని గంభీరమైన ప్రకటనలు జారీ చేస్తారు. ఇది కాక రాష్ట్రప్రభుత్వంతో ఉండే రహస్య మొహమాటాలు కొన్ని.

గత కొద్ది సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణా గొడవలో పడి తెలంగాణా స్థానిక గ్రామీణ సమస్యలు చాలా నిర్లక్ష్యానికి గురయ్యాయి. నాయకులూ ప్రభుత్వమూ కూడా తెలంగాణాలో తమకి ప్రచారాన్ని తెచ్చిపెట్టే అంశాలే మాట్లాడుతున్నారు తప్ప ఎంతో కాలంగా గ్రామస్థాయిలో మండల స్థాయిలో పేరుకుపోయిన సమస్యల్ని అవినీతిని విచ్చలవిడిగా వదిలిపెట్టారు. ఇప్పట్లో ప్రత్యేక తెలంగాణా వచ్చే అవకాశాల్లేవు కాబట్టి ముందు ఆ సమస్యల వైపు దృష్టి పెడదాం. 

రేపు మన వంతు…?

2008 February 14
Posted by అభిషేక్ చౌదరి

బొంబాయిలో నార్త్ ఇండియన్సు విపరీతంగా డామినేట్ చేసేస్తున్నారని కుర్ర ఠాకరే ఒకాయన గగ్గోలు పెడతన్నాడు. ఆయనకి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అని ఒక సొంత పార్టీ ఉంది. అది పెద్ద ఠాకరేగారి శివసేనకి పుట్టిన కుర్ర శివసేన. రెండు పార్టీల అజండా ఒకిటే. మరాఠీ ప్రజల బాగోగులు. కుర్ర ఠాకరే గగ్గోలెనక చానా గొడవుంది. బొంబాయిలోనే కాదు మహారాష్ట్రలో యాడికి పోయినా హిందీవాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది. ఇది వాస్తవం. వాళ్ళ సంఖ్య లోకల్ మరాఠీల సంఖ్యతో పోలిస్తే తక్కువే గాని జాతీయభాష పేరుతో వాళ్ళు చెలాయించే రౌడీయిజం జులుం మాత్రం భరించ సెక్యం కాకుండా ఉంది. ఈ దేశానికంతా కలిపి హిందీవాళ్ళొక్కళ్ళే చట్టబద్ధమైన ప్రథమ తరగతి పౌరులైనట్టూ మనమంతా ఎక్కణ్ణుంచో వచ్చి సరైన వీసాలూ పాస్‌పోర్టులూ లేకుండా  ఇండియాలో జొరబడ్డ అక్రమ జనాభా అయినట్లూ వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ చూస్తే నాకేడనో కాలిపోద్ది.

నా మటుకు నేను ఠాకరే వ్యవహారం ఏదో రాజకీయం అని మాత్రం అనుకోవడం ల్యా. నిజంగానే అతను చెబుతున్న సమస్యలన్నీ హిందీవాళ్ళతో మరాఠీ ప్రజలు ఎదుర్కుంటా ఉన్న మాట వాస్తవం. అణుమాత్రమైనా అతిశయోక్తి లేదు. యాణ్ణుంచో వచ్చి తిష్టేసిన హిందీవాళ్ళలో రెండో జనరేషను పిల్లకాయలు ఒక్క ముక్క మరాఠీ నేర్చుకోకుండా మహారాష్ట్ర లోకల్సుగా చెలామణీ అవుతూ మరాఠీ ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన ఉద్యోగాలన్నీ కొట్టేస్తా ఉన్నమాట నిజం. బొంబాయిలో మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మరాఠీలు 10-15 శాతం కంటే లేరనేదీ నిజం. వాళ్ళ మూలంగానే మరాఠీ భాష అధికార భాషగా అమలుకాకుండా పోయిందనేదీ నిఖార్సైన నిజం.

ఈడ హైదరాబాదులో మన చరిత్ర కూడా అదే దారిలో నడస్తా ఉంది. ఈ రాష్ట్రానికి చెందిన 20 జిల్లాలవాళ్ళకి ఈడ ఉద్యోగం సంపాదించే హక్కు లేదు. అలా మన తెలంగాణా సోదరులు ఏర్పాటు చేశారు. ఫలితంగా మన ఉద్యోగాలన్నీ హైదరాబాదులో తిష్ఠేసిన హిందీవాళ్ళు కొట్టేస్తా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పోరేషన్ లో వాళ్ళే సగం మంది ఉన్నారు. వాళ్ళంతా ఒక ముఠా. వాళ్ళందరూ ఏకమై తెలుగువాళ్ళని తొక్కేస్తా ఉంటారు. తెలుగు అధికారభాషగా అమలుకాకుండా మోకాలడ్డం పెడతా ఉంటారు. మనవాళ్ళూ ఒట్ఠి ఎదవలు. అవతలివాడు కాస్త తేడాగా కనపడంగానే ఎదవ నవ్వొకటి పులుముకుని వాడికంటే ముందే హిందీలో ఎత్తుకుంటారు సంభాషణ. మనమే హిందీలో మొదలుపెట్టేస్తూంటే వాడి బొంద ! వాడి జన్మకింక తెలుగెప్పుడు నేర్చుకుంటాడు ? వాడికి ఆ అవసరమే రాకుండా లేకుండా చేస్తున్నది మనమే గదా !

హిందీ రాష్ట్రాల్లో జనాభా చానా చానా ఎక్కువ. ఎంత ఎక్కువంటే యు.పి. వైశాల్యం ఏ.పి.వైశాల్యం కంటే తక్కువ. కాని దాని జనాభా 18 కోట్లు. అక్కడ ప్రభుత్వాలు ఉన్నా లేనివాటితో సమానం. అందుచేత ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఆ రాష్ట్రాలవాళ్ళు అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో పనెతుక్కుంటూ ఎల్తారు. అప్పుడే జరుగుతా ఉందంటే - ఎక్కడైనా అభివృద్ధి మొదలు కావడం ఆలస్యం, పొలోమని వేలుగా లక్షలుగా హిందీవాళ్ళొచ్చి వాలిపోతున్నారు. ముంబాయి అట్లనే అయింది. అస్సాం అట్లనే అయింది. మన హైదరాబాదూ అట్లనే అయింది. ఇప్పుడు విశాఖపట్నం అట్లనే అవుతా ఉంది. ఈ హిందీ జనతా నుంచి తప్పించుకునే మార్గమేందో అర్థం కాకుండా ఉంది. ఇట్ల చూస్తా ఉంటే కొంతకాలానికి మన రాష్ట్రంలో మనమే మైనారిటీలం, హిందీవాళ్ళు మెజారిటీ అయిపోతారేమోనని బయంగా ఉంది.

”మహారాష్ట్ర మరాఠీలదే” అనే వాదాన్ని నే సమర్థిస్తా. తప్పేంది ? లేకపోతే భాషాప్రయుక్తరాష్ట్రాలెందు కంట ? నాలిక గీసుకునేదానికా ? రాజ్యాంగమంటారా ? అదేమీ దైవసృష్టి కాదు. మనం రాసుకున్నదే. లోకల్ ప్రజల ఆకాంక్షల కనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకుంటే తప్పేంది ?

అసలు రాష్ట్రాల పౌరసత్వం కూడా ఉండాల. ఆ పౌరసత్వాన్ని బయతోడు తీసుకోవాలంటే ఆ రాష్ట్రం భాష బాగా నేర్చుకుని ఉండాలని రూలు పెట్టాల రాజ్యాంగంలో !

మరాఠీలూ ! మీ పోరాటం కొనసాగించండి. మేమున్నాం మీ యెంట. మీరు మా తెలుగు బోర్డులు పీకేసినా సరే ! మేము బాధపడం. మీకా హక్కు సంపూర్ణంగా ఉంది.

తోచీ తోచనమ్మ…?

2007 October 2
Tags:
Posted by అభిషేక్ చౌదరి

ఈ రోజు కీ.శే.రాజీవ్ గాంధి భార్య సోనియాగాంధి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడబోతా ఉంది. ఆమె ఆడకెందుకెళ్ళిందో ఏం మాట్లాడబోతా ఉందో నాకు తెలవదు. తెలుసుకోవాలన్న ఇంట్రష్టూ లేదు. అయితే ఈ వార్త విన్నాక కొన్ని సందేహాలు కలిగాయి.

1. ఈమెగారు ఏ హోదాలో ఆడకెళ్ళింది ? వాళ్ళు ఏ హోదాలో ఆడ మాట్లాడనిస్తున్నారు ? మనకి తెలిసినంతవరకు ఈమెగారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలూ UPA కమిటీకి ఛెయిర్ పర్సనూ. అంతకన్నా మరింకేమీ కాదు.ఇలాగే ఫార్వర్డు బ్లాకు ముస్లిం లీగు మొదలైన అన్ని పార్టీల అధ్యక్షుల్నీ అమెరికా పీటేసి కూర్చోబెట్టి UNO లో మాట్లాడనిస్తుందా ?

2. ఇదివరలో అనాధికారిక వ్యక్తుల్ని ఇలా UN వేదిక ఎక్కనిచ్చిన దృష్టాంతాలేమీ లేవు. మన దేశం తరఫున నెహ్రూ మాట్లాడాడు. వాజపేయి మాట్లాడాడు.సరే ! వాళ్ళకా సమయంలో ఏదో ఒక పెద్ద ఆధికారిక హోదా ముద్రాధికారమూ ఏడిశాయి. ఆ ప్రకారంగా చూస్తే ఇప్పుడు మాట్లాడాల్సింది సోనియా కాదు, మన్ మోహన్ సింగు. కాని ఇలా జరుగుతోందేమిటి చెప్మా ? ఈ చర్యకి ఉన్న రాజ్యాంగబద్ధత ఏమిటి ? ఒక ప్రైవేటు వ్యక్తిగా ఈమెగారు అక్కడ పిచ్చికూతలు కూస్తే ఇక్కడ ప్రభుత్వం వాటికి కట్టుబడి ఉండాలా ?

3. కాదు-కూడదు-సోనియా స్పెషలు-అందుకని మాట్లాడనిస్తున్నాం అంటే ఆ స్పెషల్ కి అర్థమేంటో మనం తెలుసుకోవచ్చా ? మనకి తెలిసినంతవరకు రాజీవ్ గాంధి పెళ్ళాం కావడం మినహాయిస్తే ఇండియాలోనే ఈమెగారికి ఏ విధమైన స్పెషాలిటీ లేదు. మరి అంతర్జాతీయ వేదికల మీద ఇంత స్పెషల్ ఎలా అయిపోయిందబ్బా హఠాత్తుగా ? మన దగ్గర ప్రతిభా పాటిల్ కి ఎంత విలువుందో అంతర్జాతీయ వేదికల మీద సోనియాకీ అంతే విలువుంది.

4. ఈ స్పెషల్ కి అర్థమేంటో ఎవరూ చెప్పనప్పుడు కరెక్టుగా అదేంటో ఊహించే అధికారమూ అవకాసమూ మనకుంటాయి కదా !అలా ఊహించాలంటే ఈమధ్య జరిగిన సంఘటనల పరంపరంతా ఓసారి నెమరేసుకోవాల.

అవి :- (అ) అమెరికాతో అణు వొప్పందం కోసం సోనియాగాంధి అదేదో తన సొంత పెళ్ళిలాగా తహతహలాడిపోవడం. అందుకోసం దేశప్రయోజనాల్నే పణంగా పెట్టడానికీ ; బ్రిటిష్ ఇండియాలో కారన్ వాలిస్సూ రాబర్ట్ క్లైవూ మన రాజుల్ని చేసినట్టు ఇండియాని నిరాయుధం చెయ్యడానికి అమెరికాతో కలిసి కుట్రపన్నడం

(ఆ) అందుకోసం తమ ప్రస్తుత భాగస్తులైన పుర్రచేతిగాళ్ళ (CPI, CPM) తో విరోధానికీ తద్వారా తమ ప్రభుత్వాన్ని తామే కూల్చేసుకోవడానికీ తిరిగి ఎన్నికలు జరిపించడానిక్కూడా ధీమాగా సిద్ధపడడం.

(ఇ) ఇక్కడి భూముల్ని SEZ ల పేరుతో మన రైతుల నుంచి బలవంతంగా లాక్కుని విదేశీ కంపెనీలకి కట్టబెట్టడం.

(ఈ) దేశవ్యాప్తంగా మతం మార్పిడీ కార్యక్రమాలు ఎన్నడూ లేనంతగా ఊపందుకోవడం. కాంగ్రెస్ అధికారంలోకొచ్చినప్పటినుంచి హిందూమతాన్ని దెబ్బతీసే చర్యలే తప్ప మరొకటి చెయ్యడంలేదు. మన రాష్ట్రమే తీసుకుంటే ఒక్క ఏడాదిలోనే మైనారిటీ మందిరాలు మెజారిటీ మందిరాలుగా మారినై. జిల్లాల వారీగా కింద ఇచ్చిన మందిరాల స్టాట్స్ పరిశీలించండి : మొదటి సంఖ్యలు హిందూ దేవాలయాలవి. రెండో సంఖ్యలు చర్చిలవి. మూడో సంఖ్యలు మసీదులవి.


ఆదిలాబాదు—-12,346—-3,347—-18,482
అనంతపురం —-14,008—-4,892—-9,328
చిత్తూరు—-26,120—-9,098—-12,320
కడప—-22,982—-7,241—-14,223
తూర్పు గోదావరి—-8,220—-12,123—-9,230
గుంటూరు—-9,302—-16,388—-5,429
హైదరాబాదు (రంగారెడ్డి కూడా కలిపి)—-13,144—-3,204—-15,203
కాకినాడ (మెట్రోపాలిటన్)—-7,203—-8,585—-5,274
కరీం నగరు—-4,129—-1,648—-9,714
ఖమ్మం—-5,210—-7,203—-5,922
కృష్ణా—-8,929—-8,462—-3,769
కర్నూలు—-6,549—-5,203—-9,293
చిలీపట్నం—-5,000(సుమారు)—-8,320—-6,493
మహబూబ్ నగరు—-3,299—-3,128—-7,235
మెదక్—-6,302—-3,203—-3,234
నెల్లూరు—-7,993—-6,782—-7,323
నల్గొండ—-6,882—-2,412—-5,239
నిజామాబాదు —-4,638—-3,203—-9,366
ప్రకాశం—-4,255—-5,583—-4,932
శ్రీకాకుళం—-7,339–9,879–2,140
వరంగల్లు—-1,393—-6,320—-1,342
పశ్చిమ గోదావరి—-3,293—-5,464—-2,765
విశాఖపట్నం—-6,430—-3,203—-4,203
విజయనగరం—-3,891—-3,100—-3,500

(ఉ) అన్ని స్థాయిల్లోను ఒక మతానికి చెందినవాళ్ళు వచ్చి తిష్టేయడం. అదేమంటే దళితులని పేరుపెట్టుకుని బుకాయించడం

(ఊ) ఇక్కడి ఆడోళ్ళ మనస్తత్వాన్ని అమెరికా ఆడోళ్ళ తరహాలో మార్చేందుకు వీలుగా చట్టాలు తేవడం

ఇవన్నీ చూస్తా ఉంటే ఈమె ఎవురికోసం పనిచేస్తా ఉంది ? ఎవురికి అంకితమయింది ? అనే సందేహాలు కలగడం సహజం. కాని ఈ సందేహాలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇంతవరకు లభించలేదు. దొరుకుతున్న సాక్ష్యాలూ అందుతున్న సంకేతాలూ అన్నీ పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. లేకపోతే నేనీమెని గట్టిగా సపోర్టు చేస్తూ ఒక టపా రాసుండేవాణ్ణి. ఈమె కోసం ఎంతమందినైనా సరే, ఎదుర్కుని ఉండేవాణ్ణి.

ఈమెని కేంబ్రిడ్జిలోని ఒక గ్రీకు రెస్టారెంటులో రాజీవ్ గాంధికి పరిచయం చేసింది అమెరికన్లు. ఎన్నికలు రాబోతున్న వేళ ఈమెని ఇలా కృత్రిమంగా పట్టుకుని ఆకాశానికెత్తి పెద్దదానిగా ప్రొజెక్ట్ చేసి భారతీయుల చేతనే ఆమెని అయ్యారే ! భళారే ! అనిపించి గెలిపించి తన స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే వ్యూహంతో అమెరికా పన్నిన పాచిక ఇది అని స్పష్టంగా తెలిసిపోతానే ఉంది.

 

త్రీ ఛీర్స్ టు ది ఇండియన్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ !

2007 September 24
Tags:
Posted by అభిషేక్ చౌదరి

 

పాకిస్తాన్ ! నీ పిలక పీకిస్తాన్ ! గర్జించు ఇండియా !  గాండ్రించు ఇండియా !
(మహాకవి శ్రీశ్రీకి క్షమాపణలతో - జొహానెస్ బర్గులో గెలిచిన భారతీయ ఆటగాళ్ళ జట్టుకు అభినందనలతో) )

అసలు వీడెవడు ? ఎందుకిలా రెచ్చిపోతున్నాడు ?

2007 September 23
Tags:
Posted by అభిషేక్ చౌదరి

వీడి పేరు కరుణానిధి.”రామాయణం అబద్ధం రాముడు అబద్ధం” అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వేయించిన వెధవ వీడే. తన హయాంలోనే సేతుసముద్రం ప్రాజెక్టు పూర్తిచేసి తన చుట్టూ చేరిన బడాబాబులందరికీ ఆర్థిక లబ్ధి చేకూర్చే ప్రయత్నంలో భాగంగా వీడు తన స్వార్థానికి సైద్ధాంతిక రంగు పులిమాడంతే ! తమిళనాడులో తరచుగా జరిగే మ్యూజికల్ ఛెయిర్స్ తరహా రాజకీయాల్లో తన వంతొచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి పీఠం మీద చాలా సార్లు కూర్చున్నాడు.ఇప్పుడు కూడా కూర్చున్నాడు, కూర్చోకపోతే తన పెద్దకొడుకు అళగిరిగాడూ,  చిన్నకొడుకు స్టాలిన్ గాడూ తన కళ్ళ ముందే కుర్చీ కోసం కుమ్ములాడుకుని అన్యాయంగా ఒకడి చేతిలో ఒకడు సచ్చిపోతారని భయపడి !

ఒక హిందూ మెజారిటీ గల రాష్ట్రాన్ని పరిపాలిస్తూరాముడు అబద్ధంలాంటి కారుకూతలెలా కుయ్యగలిగాడని మనలాంటి నాన్-తమిళ్ స్ చాలా బోల్డు హాచ్చెర్యపోవచ్చు.కాని మొదట్నుంచి అరవ రాజకీయాల తీరుతెన్నులు తెలిసినోళ్ళేం ఆశ్చర్యపోరు. విష్యం మీద శెప్పాలంటే శానా ఉంది.

ముందు అర్థం చేసుకోవాల్సింది ఇది. తమిళనాడు హిందూ మెజారిటీ గల రాష్ట్రమైనా అది ఆంధ్రాలాంటి రాష్ట్రం కాదు. మన దగ్గర బేపనోళ్ళ మీద ద్వేషం లేదు. బల్లగుద్ది చెప్పలేను గాని నా అనుమానమేందంటే-బేపనోళ్ళ మీద కసి పెట్టుకున్నవాడు క్రమంగా దేవుళ్ళని శాస్త్రాల్ని హిందూమతాన్ని తరువాత ఇండియానే ద్వేషించే లెవెల్ కిఎదిగిపోతాడని“.తమిళనాడు దశలన్నీ అనుభవించింది. DK, DMK పార్టీల ప్రభావంలో పడి- రామ రామ ! నా నోటితో నేననకూడదు గాని-రాముడి మెడలో చెప్పుల దండలేసి చెప్పులతో కొట్టుకుంటూ ఊరేగించిన ఘనమైన చరిత్ర ఉంది తమిళనాడు ప్రజలకి. బేపనోళ్ళని పబ్లిగ్గా బట్టలిప్పి పిలకలు లాగి చావగొట్టిన చరిత్ర ఉంది వీడి పార్టీకి. బ్రాహ్మల ఆడవాళ్ళ మీదికి గూండాల్ని పంపి మానభంగాలు చేయించిఇది బ్రాహ్మల మీద  మా జాతి ప్రతీకారంఅని గర్వంగా జబ్బలు చరుచుకున్న రికార్డుంది DMK కొడుకులకి !  

అక్కడ ఇలాంటి ఎదవలు ఇలాంటి ఎదవ కూతలు కూస్తే సంతోషించే ఎదవలున్నారు. ఇంకా కుయ్యమని ప్రోత్సహించే ఎదవలున్నారు. కూసినందుకు ఆనందించి ఓట్లేసి గెలిపించే ఎదవలున్నారు. గాంధిలోను బుద్ధుడిలోను రాములవారిలోను కూడా కులాన్ని చూసే మహానుభావులున్నారు. కాబట్టి వీడు భరోసాతోనే పిచ్చికూతలు కూశాడు. చచ్చి కుక్కజన్మ ఎత్తేదాకా కూస్తూనే ఉంటాడు.

వీడు మంగలి కులంలో జన్మించాడు. అందుచేత వీడికి అగ్రకులాలంటే మంట. ఒకడు నిమ్నకులంలో పుట్టగానే అగ్రకులాల్ని అసహ్యంగా తిడుతూ నొప్పిస్తూ అభాండాలేస్తూ కవితలూ వ్యాసాలూ ఉపన్యాసాలూ రాసేసే హక్కు ఆటోమేటిగ్గా వచ్చేస్తదా ? నాకెప్పుడూ అర్థం కాలేదీ విషయం. రాములవారిని ఇంత ధీమాగా తిట్టేస్తున్నారే, అంబేడ్కర్ ని కూడా ఇట్లనే తిడితే ఊరుకుంటారా ? ఎవడి సెన్సిబిలిటీలు వాడికున్నప్పుడు ఇతర్ల సెన్సిబిలిటీల్ని ఎందుకు పట్టించుకోరు ? రాములవారిని తిట్టడం భావప్రకటనాస్వేచ్ఛ అయితే మరి అంబేడ్కర్ ని తిట్టడం కూడా భావప్రకటనాస్వేచ్ఛే. కాదంటారా ?

ఇంతకీ రాములవారిని తిట్టడానికి వీడికున్న అర్హత ఏంది ?

వీడు ఇద్దరు పెళ్ళాల వృద్ధమొగుడు. రాముడంటే పడకపోవడానికదో కారణమై ఉండొచ్చు. వీడి చరిత్ర ఎలాంటిదో ఒక దృష్టాంతంతో తేలుస్తా. .వీడు పవర్ లోంచి దిగిపోయి ఎగస్పార్టీగా మిగిలి పిల్లితల గొరుగుతా ఉన్న రోజుల్లో ఒక సభకి వెళ్ళాడు . ఆడ ఓ కానిస్టేబులు గేటు దగ్గర కాపలా ఉండి పాస్ లేనోళ్ళని ఎనిక్కి పంపేస్తా ఉన్నాడు. మనోడి కాడ పాస్ లేదు. ఎనిక్కెళ్ళిపొమ్మన్నాడు కానిస్టేబులు. “నేనెవరో తెలుసా?”అన్నాడు మంగలోడు కళ్ళెర్రజేసి. “తెలుసులే,కరుణానిధివి కదూ !” అన్నాడా కానిస్టేబులు. “ఇది గుర్తుపెట్టుకుంటాఅని మంగలోడెళ్ళిపోయాడు. తరువాత మంగలోడు మళ్ళీ పవర్ లోకొచ్చాక కానిస్టేబుల్ ఇంటికి DMK కార్యకర్తలు పోయి అతన్ని ఇంట్లోంచి బయటికి ఈడ్చుకొచ్చి రోడ్డు మీద సజీవదహనం చేశారు.

వీడి కొడుకు స్టాలిన్ మద్రాసులో ఒక లేడీ యాంకర్ ని మానభంగం చేసి చంపేసి హాయిగా తిరుగుతా ఉన్నాడు. కోర్టులూ పోలీసులూ ఏమీ చెయ్యలేకపోయారు.

తాను ఏం మాట్లాడినా నడుస్తదనే వీడి ధీమాకి కారణం ఇది.”ఒరేయ్ కరుణానిధీ ! రాముణ్ణి బద్నామ్ చెయ్యాలనుకుంటున్న నువ్వు ఆకాశం మీద ఉమ్మేసే మూర్ఖుడివి. ఉమ్మి చివరికి నీ మొగం మీదనే పడతది.”   

న్యాయానికి పూలదండలు !

2007 September 19
Tags:
Posted by అభిషేక్ చౌదరి

ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ ఎన్నో ఎస్టేటో నాకు తెలవదు. మిగతా అన్ని ఎస్టేట్లూ భ్రష్టుపట్టిపోయినా న్యాయవ్యవస్థ అంతో ఇంతో సరింగా నడుస్తోంది కనక ఈ మాత్రం ఉన్నామని అనుకునేవాన్ని. కాని ఈ మధ్య జరిగిన సంఘటనలు చూశాక…..?

“ఆంధ్రా పి.సి.సి.మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు కొడుకు వెంకట్ నిరపరాధి”అని తేల్చేశారంట ఫోరెన్సిక్ వాళ్ళు. ఆ సచ్చిపోయిన ప్రశాంత్‌రెడ్డి ప్రపంచంలో ఇంక యాడా స్థలం లేనట్లు తనంతట తనే వెంకట్ ఇంటికెళ్ళి ఆడ కాల్చుకుని సచ్చిపోయాడంట. మనం నమ్మి తీరాల. ఎందుకంటే ఈ మాటలు ఫోరెన్సిక్ అనే శంఖంలో పోసిన తీర్థాలు కామట్టి. పాపం ! వాళ్ళీ ముక్క చెప్పడానికి - మన తెలంగాణా బిడ్డ కేశవరావు ఢిల్లీ వెళ్ళి తన ఇటలీ అమ్మని కలిసొచ్చేదాకా ఎందుకు వెయిట్ చేశారో ! 

కేసు ఇప్పటికీ జడ్జి దాకా వెళ్ళలేదు. కనక ఇది ఇంకా సబ్-జుడిస్ వ్యవహారం కాదు. కాబట్టి మన కంక్లూజన్స్‌కి మనం రావడంలో తప్పులేదనుకుంటా. అయితే జడ్జి దాకా వెళ్ళకుండానే కేసులు తేల్చిపారేస్తున్నారంటే-ఆహా ! ఆ కళానైపుణ్యం ఏమని వర్ణించను ! నిజంగా ప్రపంచంలో అన్ని హత్యలూ ఆత్మహత్యలే అయితే ఎంత బావుణ్ణు, మనకి CID, CBI లాంటి తెల్లేనుగులతో పనే ఉండదు.

ఇదివరలో ఇలాగే ఎన్నికల ముందు KCR మీద పెట్టిన కేసుల్ని ఎన్నికలయ్యాక కొట్టేశారు. ఎన్నికల ముందు మాన్య మంత్రులుగా ఉన్నవారు ఓడిపోయాక జైలుపాలయ్యారు. దీని భావమేమి తిరుమలేశా ! ఎన్నికల్లో గెలవగానే సడన్‌గా కోర్టులు వాళ్ళనెందుకు సచ్చరిత్రులుగా ప్రకటిస్తున్నాయి ? ఎవరు నేరస్థులు ? ఎవరు కారు ? ఆలోచిస్తా ఉంటే పిచ్చెక్కిపో్తా ఉంది. రాజకీయాలకీ న్యాయవ్యవస్థకీ ఏర్పడ్డ ఈ అక్రమసంబంధాల జబ్బు మన దేశంలోనే కాదంట. అమెరికాలో కూడా ఉందంట. భూషయ్యగారు అమెరికా సుప్రీమ్ కోర్టులో సీనియారిటీల్ని తొక్కిపెట్టి తనవాళ్ళందరినీ జడ్జిలుగా ప్రమోట్ చేశాడంట.

రాజకీయ నాయకుల విషయంలోనే కోర్టులిలా మొహమాటాలకి లోనవుతున్నాయా ? ఏమో మరి ! మా ఫ్రెండుకి ఒక ఆస్తి తగాదాలో అనుకూలంగా తీర్పు వచ్చాక ఫైనల్ ఆర్డర్స్ చేతిలో పెట్టడానికి అక్కడి “పెద్దమనిషి” అరవై వేలు లంచమడిగాడని తెలిస్తే మీరేమంటారు ?                 

రాముడు అబద్ధం-రాజీవుడు నిజం…సీత అబద్ధం-సోనియా నిజం…

2007 September 16
Tags:
Posted by అభిషేక్ చౌదరి

దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు వీడేంది ఈ టాపిక్ మీద ఇప్పుడు బ్లాగుతా ఉన్నాడు ? అనుకుంటున్నారా ? అదే మరి ! షాకులోంచి తేరుకోడానికి ఇంత టైమ్ పట్టింది. రాముడు అబద్ధమంట-రామాయణం అబద్ధమంట ! ఈ మాట నాస్తికులు ఎప్పట్నుంచో అంటనే ఉన్నారు. కాబట్టి అంత షాకైపోయ్యేదేం లేదు. షాకెందుకంటే ఆ ముక్క ఓ ప్రభుత్వం అనెయ్యడం వల్ల. ఇదే ప్రభుత్వం “ఖురాన్ అబద్ధం అల్లా అబద్ధం మహ్మదు అబద్ధం” అని కూడా అనుంటే నా బాధ చల్లారుండేది. అదే నోటితో మళ్ళా “బైబిలు అబద్ధం, ఏసుక్రీస్తు అబద్ధం, అబ్రహాం అబద్ధం, యెహోవా అబద్ధం” అనుంటే నేనీ టపా రాశేవాన్ని కాదు. అందరికీ మన హిందువులే దొరికారా కారుసవగ్గా ? అని నాకు యాడనో ఏ మూలనో కాలిన మాట నిజం. నాకు చెప్పకూడని చోట్ల కాలడం ఇది మొదటిసారి కాదు. ఇదివరలో మన దేవుళ్ళ బొమ్మల్ని తెల్లోళ్ళు వాళ్ళ బాత్‌రూముల్లో టైల్సుగా, చెప్పుల మీద డిజైన్స్‌గా వాడారని తెలిసినప్పుడు నాకు కత్తులూ కటార్లూ ఇంకా అనేక ఇతర ఆయుధాలూ గుర్తొచ్చిన మాట నిజం.

అలాగని నేనేం పెద్ద అదిరిపోయే లెవెల్లో రామభక్తుణ్ణీ కాదు. రోజూ ఇరగబడి పూజలు జేశేవాన్నీ కాదు. హిందూత్వ సపోర్టర్‌నీ కాదు. కాని నాకు బాధ కలిగింది ఈ వార్త విన్నాక. నాలో అనేక ప్రశ్నలు తలెత్తాయి.

చారిత్రిక ఆధారాలు లేవంట. దేనికున్నాయబ్బా చారిత్రిక ఆధారాలు ? గాంధి అనేవాడున్నాడని ఇప్పుడెవరైనా నిరూపించగలరా ? హిట్లరనేవాడున్నాడని నెపోలియన్ ఉన్నాడని ఇప్పుడెవరైనా నిరూపించగలరా ? ఇప్పుడు ఏ ఆధారం చూపించినా అది మన నమ్మకమే అవుతుంది తప్ప అది ఏ రకంగాను నిరూపణ కాదు. అటువంటప్పుడు వేలాది సంవత్సరాల కిందట జరిగిన విషయాన్ని ఇప్పుడు నిరూపించడం ఎట్ల సాధ్యం ? రామాయణమే కాదు, ప్రపంచంలో ఏ ఇతర ఇతిహాసమైనా అట్ల నిరూపించబడ్డ సందర్భమేదైనా ఉందా ? మరి రామాయణాన్నే ఎందుకు బోనెక్కించారు ? ఏ వుద్దేశంతో ఎక్కించారు ?  

నమ్మడం నమ్మకపోవడం వాళ్ళ వాళ్ళ ఇష్టం.”రాముడున్నాడని నమ్ము” అని మనం ఎవరినీ బలవంతం చెయ్యట్లేదే ? “రామాయణం నిజమని నమ్మా”లని మనం రోడ్డెక్కడం లేదే ? కాని అందరి సెంటిమెంట్లనీ దృష్టిలో పెట్టుకుని పరిపాలించాల్సిన ప్రభుత్వం తన అపనమ్మకాల్ని జాతి నెత్తిన రుద్దాలని ప్రయత్నించడమేంటి ? హిందువుల వోట్లతో గెలిచి హిందువుల్ని పరిపాలించే ఈ ప్రభుత్వానికి హిందువుల మతాన్నీ విశ్వాసాల్నీ గౌరవిస్తున్నట్టుగా కనీసం నటించే అవసరం కూడా ఎందుకు కనిపించట్లేదు ? దీని వెనక ఉన్న “విదేశీహస్తం” ఎవరిది ?

ఆ అఫిడవిట్టుని తరవాత ఉపసంహరించుకున్నారంట, సగం పెట్టి మేనత్తవన్నట్టు. అంతమాత్రాన వాళ్ళ పాపం కడుక్కుపోదు. వాళ్ళ ఉద్దేశాలు నగ్నంగా బైటపడ్డాయి. వాళ్ళు ఎవరి గురించి పనిచేస్తున్నారో వాళ్ళు ఈ జాతికి శత్రువులో మిత్రులో క్లియర్‌గా అర్థమైపోయింది.